వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ముఖ్యమంత్రి, స్పీకర్ లపై క్రిమినల్ చర్యలకు హైకోర్టులో పిల్
21 Mar 2016 12:48 PM
హైదరాబాద్ః రోజాను సభలోకి అనుమతించకపోవడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద రావులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు స్టే ఇస్తూ..ఆమె సభకు వెళ్లేందుకు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, కోర్టు ఆదేశాలను కూడా టీడీపీ ప్రభుత్వం ధిక్కరించింది. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి, సభాపతిలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గోపాలకృష్ణ కళానిధి కోర్టును అభ్యర్థించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా చంద్రబాబు, కోడెల కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని కళానిధి ఆరోపిస్తున్నారు.
అంతకుముందు సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందని సీరియస్ అయ్యింది. సుప్రీం ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు రోజా సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సభకు వెళ్లేందుకు రోజాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ప్రభుత్వం, సభాపతి, అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ మార్షల్ రోజాను సభలోకి రానీయకుండా న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు.