వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అవినీతిపై విచారణ చేపట్టాలి
31 Jan 2017 6:25 PM
చిత్తూరు: బైరెడ్డిపల్లె పీఏసీఎస్లో చోటు చేసుకున్న అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైరెడ్డిపల్లె మండల కన్వీనర్ ఆర్.కేశువులు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. పీఏసీఎస్లో సుమారుగా రూ. కోటి వరకు అవినీతి చోటుచేసుకున్నట్లు తెలుస్తుందన్నారు. రైతుల సొమ్మును కాజేసిన దోషులను కోర్టులో ముద్దాయిలుగా నిలబెట్టాలని డిమాండ్ చేశారు. వేరుశనగ కాయలు మండలానికి రాకుండానే బయట మిల్లులకు విక్రయించడంపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలన్నారు. కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రోద్బలంతోనే అవినీతి చోటుచేసుకుందన్నారు. ఇప్పుడు అవినీతికి పాల్పడిన వారు తప్పించుకొన్నా తమ పార్టీ అధికారం లోకి రాగేనే విచారణ చేపట్టి దోషులకు శిక్ష పడేలా చేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు.