జనమే.. వైయస్‌ జగన్‌

  • ప్రజల చెంత ప్రతిపక్ష నేత 
  • రాష్ట్రవ్యాప్తంగా కలియ తిరుగుతున్న వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
  • బాధితుల కన్నీళ్లు తుడుస్తూ..నేనున్నానని భరోసానిస్తూ
  • ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం 
  • వరుస పర్యటనలతో బిజీగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
– నవంబర్‌ 29, 30న వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ పర్యటన. ఈ సందర్భంగా పలు బాధిత కుటుంబాలకు పరామర్శ, నోట్ల రద్దుతో జనం పడుతున్న ఇబ్బందులు స్వతహాగా తెలుసుకున్న ప్రతిపక్ష నేత
–డిసెంబర్‌ 1న కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని బందర్‌ పోర్టు బాధిత గ్రామాల్లో వైయస్‌ జగన్‌ పర్యటించారు. రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. విద్యా, వైద్యం కోసం వారు పడుతున్న ఇబ్బందులకు వైయస్‌ జగన్‌ చలించిపోయారు.
– డిసెంబర్‌ 3న ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబుకు వైయస్‌ జగన్‌ లేఖ రాశాను. 
– డిసెంబర్‌5, 6వ తేదీల్లో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమంపై వైయస్‌ జగన్‌ సమీక్షలు నిర్వహించారు.
– డిసెంబర్‌ 7,8వ తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో వైయస్‌ జగన్‌ పర్యటించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించి గిరిజనులు, రైతులు పడుతున్న ఇబ్బందులు, వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొనివచ్చారు. 
–డిసెంబర్‌9న ఆరోగ్యశ్రీ అమలు తీరుకు నిరసనగా ఒంగోలులో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌: నాయకుడంటే ఎందాకైనా తోడుగా నిలవడం, ఆపద వచ్చినప్పుడు అండగా నిలవడం.అధికారం ఉన్నా..లేకున్నా జనం వెంట ఉండేవాడే నిజమైన నాయకుడు. ఇందుకు మంచి ఉదాహరణ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత అవసరమని చెప్పడమే కాదు దాన్ని తూచా తప్పకుండా పాటించే సరైన నాయకుడు వైయస్‌ జగన్‌. ఒక్క శాతం ఓట్లతో అధికారానికి దూరమైన వెరవలేదు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానివ్వకుండా ప్రతిపక్షమంటే ప్రజల గొంతు సరైన నిర్వచనం చెప్పడమే కాదు. నిత్యం ప్రజల తరఫున పోరాటం చేస్తూ..ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు వైయస్‌ జగన్‌. రాష్ట్రంలో ఏ మూలన ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే అక్కడ వాలిపోయి ప్రజల గొంతు వినిపిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జాతరే. జనం స్వచ్ఛందంగా తరలివచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు. అందుకే వైయస్‌ జగన్‌ అంటే జనం అనక తప్పదు. వైయస్‌ జగన్‌ రెండున్నరేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమిస్తూనే..చట్టసభల్లోనూ, బయట ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. గత పక్షం రోజులుగా ప్రతిపక్ష నేత వరుస పర్యటనలతో నిత్యం జనం మధ్యే ఉంటూ వారి బాధలు తెలుసుకుంటూ, బాధితులకు అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు.

బందర్‌ పోర్టు బాధితులకు వైయస్‌ జగన్‌ భరోసా
బందరు పోర్టు బాధితులకు అన్యాయం జరగకుండా అడ్డుకుంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ యిచ్చారు. రైతుల భూములు బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సమిష్టిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అన్నిరకాలుగా తోడుంటామని భరోసా యిచ్చారు. డిసెంబర్‌ 1న కృష్ణా జిల్లా బందరు పోర్టు బాధితులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ కష్టాలను జననేతకు వెళ్లబోసుకున్నారు.

గిరిపుత్రులకు అండగా ప్రతిపక్ష నేత
అభివృద్ధికి దూరంగా ఉంటున్న గిరిజనులకు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ అండగా నిలిచారు. డిసెంబర్‌ 7, 8వ తేదీల్లో తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన వైయస్‌ జగన్‌ ముంపు ప్రాంతాల్లో రైతుల ఇబ్బందులు, గిరిజనులు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయారు. పోలవరం నిర్వాసితుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఆయన ఎండగట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించిన వైయస్‌ జగన్‌..ప్రాజెక్ట్‌ కోసం త్యాగం చేసి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు. పెట్రోల్, డీజిల్, సిమెంట్, ఇనుము, ఇసుక రేట్లు తగ్గుతున్నా... కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యయాన్ని చంద్రబాబు ఏటేటా పెంచుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు ప్రాజెక్టుకోసం భూములిచ్చిన గిరిజనులు పరిహారం అడిగితే జైల్లో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరెక్కడా ఉండబోడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  గిరిజనుల అవస్థల గురించి చెప్తే అభివృద్ధి నిరోధకులని అభాండాలు వేసేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. పోలవరంలో భాగమైన పట్టిసీమకు భూములిచ్చిన రైతులకు రూ.19 లక్షలిచ్చారు. పశ్చిమ గోదావరిలో రూ. 10.50 లక్షలు ఇచ్చిన ప్రభుత్వమే తూర్పు గోదావరిలో రూ.7.50 లక్షలు మాత్రమే ఇస్తోంది. ఒకే ప్రాజెక్టు కింద ఒక్కో చోట ఒక్కో రకమైన పరిహారం ఇవ్వడం ఎక్కడైనా ఉందా? పట్టిసీమలో ఇచ్చినట్లే ప్రతి రైతుకూ అదే రూ.19 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  గిరిజన ప్రాంతాల్లో సంభవిస్తున్న ‘‘కాళ్ల వాపు వ్యాధి, పౌష్టికాహారలోపంతో శిశుమరణాలపై వైయస్‌ జగన్‌ మనసు కలత చెందింది.  ఏ జబ్బుతో చనిపోయారో కూడా తెలియని దారుణమైన పాలనలో మనం ఉన్నామని, జనం చచ్చిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

 ఆరోగ్యశ్రీ అమలుపై ఆగ్రహం
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని పేదల గుండెల నుంచి తొలగించేందుకే ఆయన నెలకొల్పిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వీర్యం చేస్తుండటంపై వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు సర్కారు నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ వైయస్‌ఆర్‌‡ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద డిసెంబర్‌ 9న ధర్నాలను నిర్వహించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రకాశం భవన్‌ వద్ద జరిగిన మహాధర్నాలో పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు మెడలు వంచి సంక్షేమ పథకాలు అమలు చేయిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు ఉచిత వైద్యం అందించి దివంగత సీఎం వైయస్‌ పేదల గుండెల్లో దేవుడిలా నిలిస్తే.. ఆ పథకానికి నిధులివ్వకుండా చంద్రబాబు పేదల ఉసురుపోసుకుంటున్నారని వైయస్‌ జగన్‌ విమర్శించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నేత విస్తృతంగా పర్యటిస్తూ బాధితులకు అండగా ఉంటున్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top