రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్ సీఎం కావాలని అందరు కోరుకుంటున్నారు - ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
15 Jun 2018 6:10 PM
తూర్పు గోదావరి: వైయస్ జగన్ సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మా తండ్రి ఇచ్చిన ఆస్తి మీరే అన్నారు. వైయస్ జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యానని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమన్నారు. ప్రజాప్రతినిధులను చంద్రబాబు ఉత్సవ విగ్రహాలుగా మార్చారని మండిపడ్డారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారని, చంద్రబాబు సీఎం అయితే లోకేష్ ఒక్కరికే ఉపయోగమన్నారు. వైయస్ జగన్ సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మొన్న కృష్ణా బ్యారేజీ కదిలిందని, నిన్న గోదావరి బ్రిడ్జి ఊగిందన్నారు. నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తునే ఉన్నామన్నారు. మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని, మన సమస్యలు తీరబోతున్నాయని చెప్పారు. అరటి రైతులు, పచ్చడి కార్మికులు, పూత రేకుల తయారీదారుల సమస్యలు వైయస్ జగన్ తెలుసుకున్నారన్నారు. వైయస్ జగన్ పాదయాత్ర మన నియోజకవర్గంలో 40 కిలోమీటర్లు సాగిందన్నారు.