ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
టీడీపీ పాలనలో ప్రజల అవస్థలు
20 Apr 2016 12:03 PM
టీడీపీ పాలనలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బాబు నియంత, నిర్లక్ష్యపు పాలనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా...చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు సరికదా ప్రజాసమస్యలను పూర్తిగా గాలికొదిలేశారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు, కరువు, తాగునీటి ఎద్దడితో ప్రజలు నరకయాతన అనుభవిస్తుంటే..పాలకులు మొద్దు నిద్ర వహిస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చడంలో బాబు ఘోరంగా విఫలమయ్యారు. గొంతెండుతోంది దప్పిక తీర్చండి మహోప్రభో అని ప్రజలు నెత్తినోరు మొత్తుకుంటున్నా...అధికార పార్టీ నేతల చెవికి ఎక్కడం లేదు.