వారి అక్రమాల చిట్టా ప్రజలందరికీ తెలుసు

అనంతపురం: అనంతపురం జిల్లాలోని మిస్మమ్మ భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన కుటుంబం అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈవ్యవహారంపై ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని గురునాథ్‌రెడ్డి సవాల్ విసిరారు.

మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సురి అక్రమాల చిట్టా ప్రజలందరికీ తెలుసునని గుర్నాథరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కావాలనే తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం ఉన్నంతవరకు వైఎస్ జగన్‌ వెంటే ఉంటానని తేల్చిచెప్పారు. 

Back to Top