ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

చంద్రన్నసంక్రాంతి
కానుకలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు
ఎక్కడ కూడా వాటిని ఆచరించడం లేదు. సరుకులు పంపీణీ చేయకుండా  ప్రజలను తీవ్ర
ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పేదలు సరుకుల కోసం రోజుల తరబడి రేషన్
దుకాణాలకు తిరిగినా ఫలితం ఉండడం లేదు. కూలీ పోయి సరుకులు అందక
విసుగెత్తిపోతున్నారు. 

సర్వర్ డౌన్, ఈపాస్
ముద్రలు పడడం లేదంటూ అధికారులు చెబుతుండడంతో ప్రజలు అసహనం వ్యక్తం
చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పచ్చనేతలు అర్హులైన లబ్దిదారులకు
సరుకులు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. ప్రభుత్వ తీరుపై లబ్దిదారులు
మండిపడుతున్నారు. పాలకులు, అధికారులు జనం సమస్యలే పట్టించుకోవడం లేదని
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
Back to Top