మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పాత పద్ధతిలోనే పింఛన్లు పంపిణీ చేయాలి
13 Dec 2016 11:00 AM
శ్రీకాళహస్తి: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని వైయస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పునుగోటి భక్తవత్సలనాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీలో ఆయన విలేకర్లుతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వారి ఖాతాల్లో పింఛన్ వేస్తామని చెప్పి ఇప్పుడు బ్యాంకులు చుట్టూ తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా ఇద్దరికి కలిపి రూ.2 వేల నోటు ఇస్తున్నారని, ఆ నోటుకు చిల్లర దొరక్కక వృద్ధులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. బ్యాంకుల్లో అప్పు ఉంటే పింఛన్ సొమ్మును జమచేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వృద్ధులు ఐదారు సార్లు బ్యాంకులకు వచ్చినా.. నగదు లేదని చెప్పటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకుని వారికి అనుకూలంగా పింఛన్లు పంపిణీ చేయాలని ఆయన కోరారు.