కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బాబూ జగ్జీవన్ రామ్ కు నివాళులు
05 Apr 2016 12:04 PM
హైదరాబాద్: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన మహానీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కే. రోజా అన్నారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున, తెలంగాణ ఎస్సీ సెల్ చీఫ్ నల్లా సూర్య ప్రకాష్, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... నాలుగు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా సేవలు అందించి, కార్మిక, వ్యవసాయ, రక్షణ మంత్రిత్వ శాఖలకు నాయకత్వం వహించి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు జగ్జీవన్ రామ్ అని వివరించారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.
For Video : https://www.youtube.com/watch?v=TLA08XeWmc4