దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ప్రత్యేకహోదాకు అడ్డుపడుతుంది చంద్రబాబే
21 May 2016 2:31 PM
హైదరాబాద్ః రాష్ట్రమంతా ప్రత్యేకహోదా కోసం నినదిస్తుంటే...గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్లు హోదా వల్ల ఒరిగేదేమీ లేదన్న వాదనను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లడం శోచనీయమని వైయస్సార్సీపీ సీినియర్ నేత పార్థసారథి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా పదేళ్లు ఇస్తే సరిపోదు, 15 ఏళ్లు కావాలని మాట్లాడిన బాబు...ఇప్పుడు హోదా అవసరమే లేదని మాట్లాడడం దుర్మార్గమన్నారు. అసలు ప్రత్యేకహోదాకు అడ్డుపడుతోంది చంద్రబాబేనన్న అనుమానం కలుగుతుందన్నారు. హోదాను నీరుగారుస్తూ చంద్రబాబు ఐదుకోట్ల ఆంధ్రులను మోసం చేస్తున్నారని...హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.