మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
'చంద్రబాబు రైతుల గొంతుమీద ఆర్డినెన్స్ అనే కత్తి పెడుతున్నారు'
24 Aug 2015 2:39 PM
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల గొంతుమీద ఆర్డినెన్స్ అనే కత్తి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ మండిపడింది. భూసేకరణ పేరుతో చంద్రబాబు తన రాక్షస మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టుకుంటున్నారని వైఎస్సార్ సీపీ నేత పార్ధసారథి విమర్శించారు.
భూసేకరణ ఆర్డినెన్స్ పై కేంద్రమే పునరాలోచనలో పడితే.. చంద్రబాబు మాత్రం తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. భూసేకరణ ఆర్డినెన్స్ పై పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి కేంద్రమే మల్లగుల్లాలు పడుతుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం రైతుల మెడపై కత్తి పెడుతూ భూములు లాక్కొంటుందని ఆయన ఎద్దేవా చేశారు. దీనిపై కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.