రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చంద్రబాబూ.. ఇది సిగ్గుచేటు..!
05 Aug 2015 10:27 PM
హైదరాబాద్) రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాలకు షికారు చేయటం సిగ్గుచేటు అని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్థ సారధి అన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు వానలు లేక పొలాలు ఎండిపోతున్నాయని పార్థ సారధి చెప్పారు. ప్రత్యామ్నాయ విధానాల మీద చైతన్య పరచాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అటువంటి దాఖలాలు కనిపించటం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని పార్థ సారధి కోరారు.