పాముల రాజేశ్వ‌రీదేవి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌
లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ
అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాజేశ్వరీదేవి తన అనుచరవర్గంతో
కలిసి పార్టీలో చేరారు. ఆమెను వైయ‌స్ జ‌గ‌న్ సాద‌రంగా పార్టీలోకి
ఆహ్వానించారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి రాజేశ్వరీదేవి రెండు సార్లు
ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే.

తాజా వీడియోలు

Back to Top