మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
190వ రోజుకు చేరిన మరో ప్రజాప్రస్థానం
25 Jun 2013 10:28 AM
శృంగవరం 25 జూన్ 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారానికి 190వ రోజుకు చేరింది. ఉదయం విశాఖ జిల్లా శృంగవరం నుంచి మరో ఆమె పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో మహానేత అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. శ్రీమతి షర్మిల గాంధీనగరం, తాండవ జంక్షన్, డి. ఎర్రవరం, ములగపూడి, మెట్టపాలెం, బెన్నవరం మీదుగా సాగుతారు. మంగళవారం ఆమె 12.7 కిలోమీటర్లు నడుస్తారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం సాయంత్రం విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.