చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పార్టీ మద్దతుదారులను బలపర్చండి: పెన్మెత్స
30 Jan 2013 12:32 PM
గంట్యాడ:
రానున్న సహకార సంఘాల ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన మద్దతుదారులకు ఓటు వేయూలని పార్టీ విజయనగరం జిల్లా కన్వీనర్ పెన్మెత్స సాంబశివరాజు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా వసంత, చంద్రంపేట, సిరిపురం గ్రామాల్లో సహకార సంఘాల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయూ గ్రామాల్లో జరిగిన సభల్లో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు రుణ మాఫీ చేయించిన ఘనత మహానేతదేనని అన్నారు. ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. వీటన్నింటిని గుర్తించి సహకార సంఘాల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులకు ఓటు వేయూలని పిలుపునిచ్చారు.
జగన్తోనే రైతు సంక్షేమం
నెల్లిమర్ల: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డితోనే రైతు సంక్షే మం సాధ్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ పెనుమత్స సురేష్బాబు అన్నారు. సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత మహానేత వైయస్ఆర్ హయూంలో రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు.