విజయనగరం జిల్లా : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరచి రైతులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు విక్రయించిన వరి ధాన్యానికి సత్వరమే చెల్లింపులు చేయాలని కోరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.<br/>ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నవంబర్లోనే తెరిచి ఉండాల్సి ఉండగా...ఇప్పటికీ అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. వచ్చే సీజన్లో అయినా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.