22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
కోర్టు ధిక్కరణలోనూ హై డ్రామా
22 Mar 2016 11:11 PM
హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని తుంగలోకి తొక్కిన హైడ్రామా అలాగే కొనసాగుతోంది. ఎమ్మెల్యే రోజా ను శాసనసభ లోకి అనుమతించాలంటూ ఇచ్చిన హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అసెంబ్లీ వర్గాలు అంగీకరించలేదు. ఆమెను అడ్డుకోవటం ద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. కనీసం ఈ అంశంలో కోర్టు ధిక్కరణ నోటీసులు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి స్టాండింగ్ కౌన్సిల్ నిరాకరించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రోజా తరఫు న్యాయవాది తెలిపారు. అయితే నోటీసులు స్వీకరించవద్దంటూ తమకు ఆదేశాలు ఉన్నాయని పాత పాటే వినిపించారు.