చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పేదల ఇళ్ల జోలికి వస్తే సహించేది లేదు
31 Jan 2017 6:20 PM
నిజాంపట్నం: పేదల నివాసాల జోలికి వస్తే సహించేది లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు హెచ్చరించారు. గోకర్ణమఠం గ్రామానికి చెందిన పలువురు మహిళలు మంగళవారం నిజాంపట్నంలోని మోపిదేవి నివాసంలో ఆయనను కలిసి తమ సమస్యను వివరించారు. గోకర్ణమఠం గ్రామంలోని గొకర్ణేశ్వర స్వామి ఆలయానికి చెందిన స్థలంలో గత 60 సంవత్సరాల నుంచి 34 కుటుంబాలు జీవిస్తున్నారు. అయితే ఇటీవల ఎండోమెంట్ అధికారులు ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన మోపిదేవి అధికారుల తీరును తప్పుపట్టారు. ఎప్పటి నుంచో గృహాలు కట్టుకుని నివసిస్తున్న పేదల ఇళ్లను ఖాళీ చేయమని ఎండోమెంట్ అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఎండోమెంట్ అధికారులు ప్రభుత్వ ధర ప్రకారం పేదల నుంచి నగదును కట్టించుకుని ఆ పేదలకు పూర్తిస్థాయిలో స్థలాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.