నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
మహిళలకు బాబు పాలనలో రక్షణ కరువు
05 Jul 2016 7:12 PM
చెన్నై: టీడీపీ
పాలనలో మహిళలకు ఏమాత్రం రక్షణ ఉందో తన సతీమణిపై జరిగిన దాడి ఉదంతమే నిదర్శనమని
చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ చైర్పర్సన్ కె.శాంతి భర్త కేజే కుమార్ అన్నారు. ఫోన్
ద్వారా పరామర్శించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటిదాకా ప్రభుత్వ వర్గాలు పట్టించుకోలేదని అన్నారు. చెన్నై ఆసుపత్రిలో
శాంతి కి చికిత్స అందిస్తున్నారు. అక్కడ కేజే కుమార్ మీడియాతో మాట్లాడారు.
దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన అమృత్రాజ్
తమిళనాడుకు చెందిన నేరస్తుడన్నారు. బియ్యం స్మగ్లింగ్కు పాల్పడుతూ తమిళనాడు
పోలీసుల రికార్డుల్లో పీడీ యాక్టుకు గురై ఏడాదిపాటూ అమృతరాజ్ పుళల్లో జైలు జీవితం
గడిపాడని చెప్పారు. అతని సోదరుడు మైఖేల్రాజ్ నకిలీ మద్యం తయారీలో నిందితుడని
చెప్పారు.
అమృత్రాజ్ ఏడాదిపాటూ పుళల్లో జైలు జీవితం గడిపి
బయటకు రాగా ఇంకా కేసు విచారణలో ఉందని అన్నారు. తమిళనాడు పోలీసుల కళ్లుగప్పి
ఆంధ్రప్రదేశ్లో తలదాచుకుని ఉన్న నేరస్తులను గాలి ముద్దుకృష్ణమనాయుడు చేరదీశారని
ఆరోపించారు.
మునిసిపల్ పరిధిలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో
పాల్గొనే హక్కు చైర్పర్సన్కు ఉంటుందనే విచక్షణను మరిచిన ముద్దు కృష్ణమనాయుడు
తమపై దాష్టీకానికి పూనుకున్నారన్నారు. స్థానిక ప్రజల్లోనే కాదు, ప్రతిపక్షాల్లో సైతం తమకు మంచిపేరున్న కారణంగా దాడుల కోసం
తమిళనాడు గూండాలపై ఆయన ఆధారపడాల్సి వచ్చిందని విమర్శించారు.