వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
విలువలకు చంద్రబాబు తిలోదకాలు
01 Mar 2016 11:42 PM
కాకినాడ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ జడ్పీ ఛైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అవినీతి తో సంపాదించిన సొమ్ములతో కొంత మందిని ఎమ్మెల్యేలను లాక్కొంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా హైదరాబాద్ నుంచి కాకినాడ చేరుకొన్న వేణు గోపాల్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఇంటి దగ్గర కిటకిటలాడిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. కలుసుకొన్న కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాలకు ప్రలోభాలు పెట్టడం మానుకోవాలని చంద్రబాబుకి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు.