కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
నిధులివ్వకుండా అభివృద్ధి ఎలా చేస్తారు బాబు..?
11 Mar 2016 3:24 PM
విశాఖ: ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శించారు. విశాఖకు నిధులు ఇవ్వకుండా కేంద్ర బడ్జెట్ ఏ విధంగా నిరాశపర్చిందో.. అదే రీతిలో రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు. నిధులు లేకుండా విమ్స్ ను ఎలా అభివృద్ది చేస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాజెక్టులకు రూపాయి కూడా కేటాయించక పోవడం దురదృష్టకరమన్నారు.
సుజల స్రవంతికి రూ. 10 వేల కోట్లు అవసరముంటే కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించడం ఎంత వరకూ సమంజసమన్నారు. విశాఖకు తాగునీరు అందించే రైవాడ ప్రాజెక్టు కు 75 లక్షలు అవసరమైతే రూ. 6 లక్షలు మాత్రమే బడ్జెట్ లో కేటాయించారన్నారు. ఈ కేటాయింపులు కేవలం కాంట్రాక్టర్లను మెయిన్ టెయిన్ చేయడానికే సరిపోతుందని ప్రసాద రెడ్డి ఎద్దేవా చేశారు.