రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
స్పీకర్ పై వైఎస్సార్ సీపీ అవిశ్వాసం నోటీస్
15 Mar 2016 9:50 AM
హైదరాబాద్ః అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభలో వ్యవహరించిన తీరు దారుణమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు అన్నారు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికార పక్షానికి తొత్తుగా మారారని ఆరోపించారు. ఎన్నో సందర్భాల్లో టీడీపీ సభ్యుడిగా వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. అన్ని విధాలుగా గౌరవంతో మా నాయకుడు వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు కోడెలను సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించారన్నారు.
స్పీకర్ స్థానంపై వైఎస్సార్సీపీకి ఎంతో గౌరవం ఉందని సుజయకృష్ణ తెలిపారు. కోడెల సభలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును తాము తప్పుబడుతున్నామన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రోజాపై స్పీకర్ వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను సభా వ్యవహారాలకు వ్యతిరేకంగా... ఏడాది పాటు సస్పెండ్ చేయించే అధికారం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు లేదన్నారు.