స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఏప్రిల్ 4న

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఆయన చాంబర్లో ఈ సమావేశం జరిగింది. స్పీకర్పై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు చర్చకు చేపట్టాలో ఈ భేటీలో నిర్ణయించారు. ఏప్రిల్ 4న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అప్పుడు స్పీకర్ శివప్రసాద్పై అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. బీఏసీ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జ్యోతుల నెహ్రు, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.
Back to Top