గుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభం
స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఏప్రిల్ 4న
26 Mar 2015 5:39 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఆయన చాంబర్లో ఈ సమావేశం జరిగింది. స్పీకర్పై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు చర్చకు చేపట్టాలో ఈ భేటీలో నిర్ణయించారు. ఏప్రిల్ 4న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అప్పుడు స్పీకర్ శివప్రసాద్పై అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. బీఏసీ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జ్యోతుల నెహ్రు, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.