చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబేది బాబూ..!
12 Mar 2016 6:34 PM
హైదరాబాద్)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెడుగుడు
ఆడుకొన్న సంగతి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా
ప్రభుత్వం చేసిన అవినీతి పనుల్ని ఆధారాలతో సహా అసెంబ్లీ లో కడిగేయటం మీద చర్చించుకొన్నారు.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ దీని మీద అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు.
‘‘ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేక
ఇబ్బంది పడ్డారు. వైఎస్ జగన్‑ను టార్గెట్ చేయడానికి మొత్తం మంత్రివర్గాన్ని
వాడుకుంటున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వైఎస్ జగన్ ఒక్కరే కాదు.. ఇతర
విపక్ష పార్టీ నేతలందరూ దూరంగా ఉన్నారు.’’ అని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం
చంద్రబాబుని ఎవరూ నమ్మటం లేదని వ్యాఖ్యానించారు. విదేశాలకు తిరగటం తప్ప
పెట్టుబడులు పెద్దగా రావటం లేదని పేర్కొన్నారు.
‘‘ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మాల, మాదిగల మధ్య చంద్రబాబు
చిచ్చుపెట్టారు. ఇప్పుడు ఏపీలో మరోసారి కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. కాపులు, బీసీల మధ్య పెడుతున్న చిచ్చు
తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటుంది. హామీలు నెరవేర్చకపోవడంతోనే ఏపీలో కాపులు ఉద్యమ
బాట పట్టారు. బడ్జెట్‑లో కాపులు కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తారనేది
అనుమానమేనని' శ్రీనివాస్ యాదవ్
దుయ్యబట్టారు.