రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
సేవ చేసే భాగ్యం కల్పించండి..!
05 Nov 2015 3:39 PM
వరంగల్ః ఓరుగల్లు ప్రజలు అత్యంత చైతన్యవంతులని వైఎస్సార్సీపీ స్థానిక పార్లమెంట్ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. బై ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని, తనకు సేవ చేసే భాగ్యం కల్పించాలని సూర్యప్రకాశ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి, వైఎస్. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే..అది రాజన్న రాజ్యంతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.
ప్రియతమ నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి సువర్ణ పాలన అందించారని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన గొప్ప నాయకుడని సూర్యప్రకాశ్ కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి పరిపాలన తిరిగి రావాలని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి పరిపాలన గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం కొనసాగిస్తామన్నారు. పోటీ చేసే అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వైఎస్ జగన్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు సూర్యప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు.