నేటి ‘మరో ప్రజాప్రస్థానం’ 14.3 కి.మీలు

రాజమండ్రి, 5 జూన్‌ 2013:‌

మహానేత డాక్టర్‌ రాజన్న తనయల, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం 170వ రోజు సాగించే పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటించారు. రాజమండ్రి సెయింట్ పా‌ల్ చర్చి నుంచి శ్రీమతి షర్మిల బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఆజాద్‌చౌక్‌, నందం గనిరాజు సెంటర్‌, కంబాలచెరువు, వివేకానందచౌక్, రాజా థియేట‌ర్ సెంట‌ర్, క్వారీ మార్కె‌ట్ సెంట‌ర్, శానిటోరియం సెంట‌ర్‌ వరకూ 5.4 కిలోమీటర్ల నడిచిన అనంతరం శానిటోరియం సమీపంలో మధ్యాహ్న భోజన భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం కొంతమూరు, కోలమూరు, గాడాల, మధురపూడి వరకూ 8.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. మధురపూడి సమీపంలోని బత్తుల సత్తిరాజు తోటలో బుధవారం రాత్రికి బస చేస్తారు. బుధవారం మొత్తం 14.3 కిలోమేటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తారని రఘురాం తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top