వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చాంద్ బాషా రాజీనామాకు డిమాండ్
25 Apr 2016 4:58 PM
గుంటూరు(దాచేపల్లి): ముస్లిం మైనార్టీ ఓట్లచే ఎమ్మెల్యే అయిన చాంద్ బాషా టీడీపీలో చేరి ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్ హుస్సేన్ మండిపడ్డారు. చాంద్ బాషా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ బిక్ష పెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చాంద్ బాషాతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలన్నారు. పార్టీ మైనారిటీ సెల్ మండల కన్వీనర్ సయ్యద్ మౌలాలీ, ఎంపిటిసి సభ్యుడు షేక్ ఖాసీం సైజా, జిల్లా మాజీ కార్యవర్గసభ్యులు షేక్ ఖాదర్ బాషా తదితరులు టీడీపీ అనైతిక రాజకీయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.