నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
బాబు ఎవరిని కలిశారు..ఎందుకు కలిశారు?
04 Apr 2018 12:24 PM
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిన్న రాత్రి చంద్రబాబు ఎవరిని కలిశారు? ఎందుకు కలిశారని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నిన్న రాత్రి చంద్రబాబు కొన్ని రహస్య సమావేశాలు నిర్వహించారని, అందులో ఏం లావాదేవీలు జరిగాయో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రి కొంతమందిని చంద్రబాబు రహస్యంగా కలిశారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడానికి చంద్రబాబు ఢిల్లీ వచ్చారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు, టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా టీడీపీ ఎంపీలు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. సభలో చర్చ జరిగితే బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.