‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
ప్రధాని దృష్టికి రాష్ట్ర సమస్యలు
30 Dec 2017 12:40 PM
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధాని నరేంద్రమోడీని కోరారు. శనివారం విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా కడపకు చెందిన ఫాతిమా మెడికల్ కాలేజ్ సమస్యని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని ప్రత్యేక హోదా అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ని త్వరితగతిన పూర్తి చేయాలని విజయసాయిరెడ్డి ప్రధానిని కోరారు. విశాఖకు రైల్వే జోన్, రాయలసీమకి స్టీల్ ఫ్యాక్టరీ తోపాటు రాష్ట్రానికి సంభందించిన అనేక సమస్యలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అన్నిటినీ త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభలో సమర్ధవంతంగా చాలా చక్కగా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ మంచి పార్లమెంటేయన్ గా గుర్తింపు తెచ్చుకొంటున్నావని, దీనిని ఇలాగే కొనసాగించాలని విజయసాయిరెడ్డిని ప్రధాని మోడీ ప్రశంసించటం గమనార్హం .