టీటీడీ వివాదంపై సీబీఐ విచారణ చేప‌ట్టాలి



తిరుపతి :  తిరుమల వెంకటేశ్వరస్వామి నగల మీద సీబీఐ విచారణ జరిపించాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ డిమాండ్ చేశారు.  ఎంపీ వరప్రసాద్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.  విచారణ అంటేనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.  టీటీడీలో జరుగుతున్న అన్యాయాలను లేవనెత్తిన రమణ దీక్షితులను తొలగించడం దారుణమని పేర్కొన్నారు.  ఆరోపణలు చేసిన వారికి చట్ట ప్రకారం ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సూచించారు. తిరుమల పోటులో అర్చకులకు తెలియకుండా తవ్వకాలు జరిపారని చెప్పారు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో.. చివరికి అధికారులకు కూడా తవ్వకాల గురించి తెలియదని చెబుతున్నారు. తిరుమల స్వామి వారి నగల మీద ఇ‍ప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.  

Back to Top