రాజీనామాల గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటు

 తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాల గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని మిథున్‌ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు పచ్చి అబద్దాల కొరు అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా పోరాటం ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఎంపీ పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితోలో లేరని తెలిపారు.  వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఎలా ఉండాలో నిరూపిస్తాడని ప్రజలను ఎంపీ మిథున్‌ రెడ్డి కోరారు.

తాజా వీడియోలు

Back to Top