చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
టీడీపీని ఏపీ ప్రజలు క్షమించరు
09 Feb 2018 3:31 PM
న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలు సాధించలేని తెలుగు దేశం పార్టీని ఏపీ ప్రజలు క్షమించరని, చివరకు ఆ పార్టీ కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినా క్షమించరని వైయస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం లోక్సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ, బీజేపీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఇటీవల పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర నిరాశపరిచిందని మేకపాటి అన్నారు. నిజంగా ఏపీకి ఎన్డీఏ, దాని భాగస్వామి అయిన టీడీపీ తీవ్ర ద్రోహం చేసిందన్నారు. పరిస్థితులు సరిగా లేవని టీడీపీ మాట మారుస్తుందన్నారు. ఏపీ ప్రజలు మోసపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్ విభజన చట్టంలో ఏం పొందుపరిచారో వాటిని నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేసినా ఏపీ ప్రజలు క్షమించరన్నారు.