మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం
25 Apr 2018 9:18 AM
అనంతపురం : రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం 2018కి పెద్ద జోక్గా ఉందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి ఎద్దేవా చేశారు. రూ.16 వేల కోట్ల పోలవరం ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 58,650 కోట్లకు పెంచారని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదు.. దీంతో ఆ తర్వాత నిధులు ఇచ్చేందుకు కేంద్రం ససేమిరా అంటోందన్నారు. సీఎం నాటకాలను కేంద్రం గుర్తించే నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు కేంద్రం సహకరిస్తే పోలవరం ప్రాజెక్ట్ను 2019 నాటికి పూర్తి చేస్తానని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
YS Jagan Mohan Reddy, CM Chandrababu Naidu, Polavaram project, YSRCP MLC