మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
స్పెయిన్ దేశస్థుల మృతిపై ఎమ్మెల్యే విచారం
05 Aug 2017 7:21 PM
మదనపల్లె రూరల్ (చిత్తూరు) : రోడ్డుప్రమాదంలో స్పెయిన్ దేశస్థులు మృతి చెందిన సంఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంకాని దేశంలో సేవ చేసేందుకు వచ్చిన మహనీయులు తిరిగి వారి దేశానికి వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురికావడం తననెంతగానో కలిచివేసిందన్నారు. అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ ఫెర్రర్ను అక్కడి ప్రజలు దేవుడిగా కొలుస్తారన్నారు. అలాంటి సంస్థకు సహకారమందించేందుకు, దాతృత్వం చూపేందుకు వచ్చిన వ్యక్తులు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు. మృతదేహాలను ఆసుపత్రిలో సందర్శించి, వెంటనే వారి స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్, ఎస్పీలకు సూచించినట్లు తెలిపారు.