కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్కు ఒక్క అవకాశమిద్దాం
08 Jan 2018 4:36 PM
చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక్కసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇద్దామని ఎమ్మెల్యే సునిల్ పిలుపునిచ్చారు. పూతలపట్టులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు హంద్రీనీవా నీరు తీసుకురాకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్గా ఉన్న తనను ఎమ్మెల్యేగా చేశారని చెప్పారు. ప్రజల కోసం అనునిత్యం వైయస్ జగన్ శ్రమిస్తున్నారని, సంక్షేమమే తన ఊపిరిగా పని చేస్తున్నారని, ఆయనకు ఉన్న నిబద్ధత మరెవరికి లేదని, దళితుల ఆత్మబంధువు అని కొనియాడారు. వైయస్ జగన్కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారన్నారు. మనమంతా కలిసి వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధిస్తారని చెప్పారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను వైయస్ జగన్కు వివరించారు.