మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నీటిని విడుదల చేయకపోతే నిరాహార దీక్ష
15 Dec 2017 11:49 AM
- గండికోట నుంచి నీరు విడుదల చేయాలని కోరుతూ పాదయాత్ర
వైయస్ఆర్ జిల్లా: గండికోట ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని సర్వరాయ సాగర్ విడుదల చేయపోతే కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపడుతానని వైయస్ఆర్సీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. సాగునీటిని సర్వరాయసాగర్కు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి సర్వరాయసాగర్ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈయన పాదయాత్రకు కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్బాబులు సంఘీభావం తెలిపారు. ప్రాజెక్టు నుంచి మూడు రోజులపాటు పాదయాత్ర కొనసాగనున్నది. ఇతర జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు నీళ్ల కోసం పోరాడుతుంటే ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులే అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర ముగిసేలోగా నీటిని విడుదల చేయకపోతే రైతులు తిరగబడుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.