చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
జీడీ నెల్లూరును బాబు విస్మరించారు
09 Jan 2018 11:48 AM
చిత్తూరు: గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్ర జీడీ నెల్లూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జననేత వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మా దురదృష్టమన్నారు. ఎప్పుడు సీఎం అయినా కూడా చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని రైతులు చెరుకు పంట సాగుపై ఆధారపడ్డారని, వైయస్ జగన్ వస్తున్నారని, మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని నారాయణస్వామి కోరారు.