త్వరలోనే బాబుకు జనం గుణపాఠం చెబుతారు

అనంతపురం, 8 సెప్టెంబర్ 2013:

రాష్ట్ర విభజనకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు లేఖే కారణమని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. ‌రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆదివారంనాడు అనంతపురంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విభజనకు అనుకూలమంటూ కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు సిగ్గు లేకుండా సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న వైఖరి చూస్తుంటే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో శకుని వహించిన పాత్ర గుర్తుకు వస్తోందని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు అతి త్వరలోనే ఉందని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Back to Top