అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్ర
05 Mar 2018 1:09 PM
ఢిల్లీ: రామాయణంలో కుంభకర్ణుడు ఆరు నెలలు మాత్రమే నిద్రపోతాడు కానీ.. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా నిద్రపోతూనే ఉన్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతుంటే చంద్రబాబు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు వైయస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామాకు కూడా సిద్ధపడ్డారన్నారు. చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే వారి పార్టీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో నాలుగేళ్లుగా ఇద్దరికే ఉద్యోగాలు వచ్చాయని, వారు లోకేష్, నారాయణ అని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైయస్ జగన్ ఒక్కరే పోరాడుతున్నారని, నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడలు వంచైనా హోదా సాధిస్తారన్నారు. ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు ఎవరికైనా వచ్చాయంటే అది లోకేష్, నారాయణకు తప్ప ఎవరికీ రాలేదు.