మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ఆర్ చేసిన మేలు మరిచిపోలేం
06 Jan 2018 12:34 PM
చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన మేలును ముస్లింలు మరిచిపోరని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంజాద్బాషా అన్నారు. శనివారం కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మైనారిటీ సదస్సులో ఆయన మాట్లాడుతూ..మహానేత పాలనలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, పిల్లలను ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదివించారని గుర్తు చేశారు. ముస్లిం మైనారిటీలు అంటే విశ్వాసానికి మారుపేరు అని అంజాద్బాషా అన్నారు. కీడు చేసిన వ్యక్తిని కూడా మరిచిపోమన్నారు. బడ్జెట్లో మాత్రమే కేటాయిస్తున్నారని, వాటిని టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్నారు. వైయస్ జగన ముఖ్యమంత్రి అయిన తరువాత రూ.2 వేల కోట్లతో బడ్జెట్ కేటాయించి ప్రత్యేక కార్పోరేషన్ఏర్పాటు చేయాలని అంజాద్బాషా కోరారు.