ఆప్‌ డరో మత్‌.. మై ఆప్ కే సాత్ హూ..




 
 కృష్ణా జిల్లా : ‘ఆప్‌ డరో మత్‌, మై ఆప్‌ కే సాత్‌  సాత్ హూ.. ’ ( మీరు ఏం భయపడకండి, మీకు తోడుగా నేనున్నాను) అంటూ ఉర్దులో వైయ‌స్ జగన్ ముస్లింల‌కు భరోసా ఇచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ముస్లింలు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. మైలవరం ముస్లిం మైనార్టీ సభ్యులు పవిత్ర మక్కాలో పార్థనలు చేసి తమతో పాటు తెచ్చిన పవిత్ర ‘జమ్‌ జమ్‌’ నీళ్లను వైయ‌స్‌ జగన్‌కు అందజేశారు. మైలవరంలో వైయ‌స్‌ జగన్‌ను కలిసిన ఎన్నార్‌ షేక్‌ సలీం సౌదీ నుంచి తెచ్చిన మదీనా చిత్ర పటాన్ని, ఖర్జురా పళ్లను ఆయనకు బహుకరించారు. సలీం సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. మా జననేతను కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే తాను సోషల్‌ మీడియాలో పార్టీ కోసం పని చేస్తున్నానని వైయ‌స్ జగన్‌కు తెలిపినట్టు, దానికి ఆయన అభినందించినట్టు పేర్కొన్నారు. 



Back to Top