కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
హైదరాబాద్ మెట్రోకు పునాది పడింది వైయస్ఆర్ హయాంలోనే
27 Nov 2017 11:59 AM
– హైదరాబాద్ సిటీజనులకు ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి ఉపశమనం కల్పించేందుకు మహానేత వైయస్ రాజశేఖర్రెడ్డి మెట్రో రైలుకు శ్రీకారం చుట్టారు.
– వైయస్ఆర్ ఆహ్వానం మేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు 2005–07 మధ్యకాలంలో నగరంలో పర్యటించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు.
– మొదటి దశలో మూడు కారిడార్లలో మొత్తం 73 కిమీ మేర ప్రాజెక్టుకు రూపలక్పన జరిగింది. ఎల్బీనగర్– మియాపూర్(29కిమీ), జేబీఎస్–ఫలక్నుమా(15కిమీ), నాగోలు– రాయదుర్గం(29 కిమీ) మార్గాల్లో పనులు చేయాలని నిర్ణయించారు.
-ఇందుకు సంబంధించిన అన్ని క్లియరెన్సులను కూడా వైయస్ ఆర్ ప్రత్యేక చొరవ చూపించి త్వరితగతిన తెప్పించారు.
– 2008 జూలైలో మెట్రో రైల్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం , టెండర్ల ప్రక్రియ చేపట్టారు.
- పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP mode) ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు.
– మైటాస్ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ఆ తరువత ఈ సంస్థ కార్పొరేట్ మోసాల కేసులో చిక్కుకోవడంతో వైయస్ సర్కారు 2009 తొలినాళ్లలో టెండర్లు రద్దు చేసింది.
– తిరిగి పారదర్శక విధానంలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఇందులో ఎల్అండ్టీ సంస్థ టెండర్లు దక్కించుకుంది.
ఎంతో దార్శనికతతో నాటిముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ప్రాజెక్టు డిజైన్ లకు అనుగుణంగానే హైదరాబాద్ మెట్రో రైలు పట్టాలకు ఎక్కుతోంది