చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
31 Aug 2017 2:01 PM
ఆత్మకూరురూరల్ః ఆత్మకూరు మండలం బోయలచిరువెళ్ల గ్రామంలో గత రెండు రోజుల క్రితం పాముకాటుకు గురై మృతి చెందిన మహిళ చంద్రకళ కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్రెడ్డి పరామర్శించారు. గ్రామానికి బుధవారం చేరుకున్న ఆయన ఆమె భర్త చిలుకూరు శ్రీనివాసరెడ్డిని, పిల్లలను కలసి పరామర్శించి సానుభూతిని తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాలపాము కాటుకు గురై మృతి చెందిన ఆమెకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేలా కృషి చేస్తానని, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియచేశారు. ఆయన వెంట వైయస్ఆర్ సీపీ నాయకులు రావూరు శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.