వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రైల్వే జోన్ దీక్షను జయప్రదం చేయాలి
10 Apr 2016 7:58 AM
అనకాపల్లి) విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ కోరుతూ వైఎస్సార్సీపీ విశాఖ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చేపట్టిన దీక్ష కోసం పార్టీ పరంగా చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 14న విశాఖ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జయంతి వేడుకలు నిర్వహించి, అక్కడ నుంచి ర్యాలీగా సభా స్థలికి రావాలని నిర్ణయించారు. అనకాపల్లి లో ఈ దిశగా పార్టీ నాయకులు సమావేశం అయ్యారు. నిరాహార దీక్ష కు సంఘీభావం తెలిపే మార్గాల మీద చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ ను తెలుగుదేశం నాయకులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. రైల్వే జోన్ ఆవశ్యకతను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ నాయకులు జానకి రామరాజు, సూరిబాబు, గాంధీ, జగన్, జాజుల రమేష్, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.