మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
తవ్వినకొద్దీ బయటపడుతున్న టీడీపీ భూకుంభకోణాలు
04 Mar 2016 12:41 PM
అమరావతిః రాజధానిలో టీడీపీ భూకుంభకోణాలు తవ్వినకొద్దీ కోకొల్లలుగా బయటపడుతున్నాయి. పేదల నోట్లో మట్టి గొట్టి చంద్రబాబు అండ్ కో సాగించిన భూ ఆక్రమణ దురాగతం...దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రైతుల భూములు, దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములను వేటినీ పచ్చదండు వదిలిపెట్టలేదు సరి కదా.
చంద్రబాబు సారథ్యంలో ఆయన తనయడు లోకేష్ ,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ...రాజధాని ముసుగులో పేదలను మోసగించి 25 వేలకు పైగా ఎకరాలను అప్పనంగా మింగేసిన ఘటన దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది.
ప్రపంచస్థాయి రాజధాని పేరుతో ప్రపంచస్థాయి దోపిడీకి పాల్పడిన చంద్రబాబు అవినీతి సునామీని చూసి యావత్ దేశం ఖంగుతింది. బాబు బినామీల భూకుంభకోణాలు చూసి ముక్కున వేలేసుకుంది.