మంగళవారం నాటి మరో ప్రజాప్రస్థానమిలా...

మాచర్ల(గుంటూరు):

దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్. జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం మాచర్ల నియోజకవర్గంలో సాగుతుంది. పర్యటన వివరాలను పార్టీ జిల్లా కమిలీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురామ్ వెల్లడించారు. మాచర్ల నియోజకవర్గంలో సోమవారం రాత్రి బసచేసిన ప్రాంతంనుంచి శ్రీమతి షర్మిల బయలుదేరి చినకొదమగుండ్లకు చేరుకుంటారని తెలిపారు. అక్కడినుంచి పెదకొదమగుండ్ల, కాకానివారిపాలెం, బ్రహ్మనాయుడు కాలనీకి వెళ్తారు. అక్కడకు 1.7 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారన్నారు. అక్కడినుంచి యాపకంపల్లి మీదుగా కారంపూడి చేరుకుని సభలో ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారని పేర్కొన్నారు.

Back to Top