చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రోజాకు సుప్రీంకోర్టులో ఊరట
15 Mar 2016 4:01 PM
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజాకు ఊరట లభించింది. రోజా పిటిషన్ పై విచారించాలంటూ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రర్ వ్యవహరించిన తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రర్పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
రేపు ఉదయం రోజా పిటిషన్పై విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఈ-మెయిల్లో హైకోర్టుకు పంపుతున్నట్లు...జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్మిశ్రాలతో కూడిన బెంచ్ ప్రకటించింది.