రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మీకు దమ్ముంటే రాజీనామాలు చేయండి
09 Aug 2017 11:48 AM
గూడూరు (నెల్లూరు): వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా రాజీనామాలు చేసి చేరుతున్నారని, టీడీపీ ఎవరు చేరినా వారి పదవులకు రాజీనామాలు చేయడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాశిన నాగులు అన్నారు. టీడీపీ నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే వారి పదవులకు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. స్థానిక రోడ్లు భవనాలు శాఖ అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉండగా, డీసీసీ పదవిని తృణపాయంగా వదులుకుని జగన్మోహన్రెడ్డి వెంట నడిచిన ఎల్లసిరి గోపాల్రెడ్డిని విమర్శించే స్థాయి ఎవరికీ లేదన్నారు. బాబు దేవాలయాలను, మసీదులను కూలుస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు.