కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
హామీలపై లోకేష్ ను నిలదీసిన మహిళలు
07 Dec 2015 6:12 PM
చోడవరం(విశాఖ) : ఎన్నికల హామీలు నెరవేర్చకుండా జనచైతన్యయాత్రల పేరుతో ఊళ్లు తిరుగుతున్న టీడీపీ నేతలను ప్రజలు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి తనయుడు లోకేష్బాబుకు మహిళల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం చీడికాడ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి వెళ్లిన లోకేష్ను మహిళలు అడ్డుకున్నారు. హుద్హుద్ తుఫాను నష్టపరిహారం ఇప్పటివరకు అందించలేదంటూ లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు కాలేదని, అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదని లోకేష్ ను నిలదీశారు. దీంతో, ఏం సమాధానం చెప్పాలో తెలియక చినబాబు బిత్తరపోయారు.