రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
పార్టీ కార్యకర్తలు, ప్రజలే కొండంత అండ
28 Nov 2017 10:56 AM
నెల్లూరు: తనకు భద్రత వద్దని, పార్టీ కార్యకర్తలు, ప్రజలే కొండంత అండగా ఉన్నారని వైయస్ఆర్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి స్పష్టం చేశారు. మరోమారు ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను ఆయన నిరాకరించారు. మూడున్నర ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే పోలీసు భద్రతా విభాగం ఇద్దరు గన్మెన్లను ఆయనకు కేటాయించింది. తనకు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి లేఖ ద్వారా తెలిపారు. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను అనుసరించి మరో రెండుసార్లు గన్మెన్లను ప్రభుత్వం కేటాయించగా తిప్పి పంపారు. తాజాగా నిన్న మళ్లీ ఇద్దరు గన్మెన్లను కేటాయించగా.. ఈసారీ కూడా అవసరం లేదని వెనక్కి పంపారు. పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో భద్రత తప్పనిసరి అని, అందుకే పంపామని పోలీస్ అధికారులు ఎమ్మెల్యే కోటంరెడ్డికి స్పష్టం చేశారు. అయితే, తనకు ఎలాంటి భద్రత అవసరం లేదంటూ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డీజీపీ, ఇంటిలిజెన్స్ డీజీ, జిల్లా ఎస్పీకి లేఖ రాశారు.